AP ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సచివాలయంలో కొనసాగుతున్న ఈ సమావేశంలో దాదాపు 40కి పైగా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలోనే ఏపీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్షరింగ్ పాలసీపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.