ఏపీ లిక్కర్ కేసులో రెడ్ కార్నర్ నోటీసులు
NEWS Jul 24,2025 02:56 pm
విదేశాల్లో ఉన్న కీలక నిందితుల కోసం సిట్ వేట కొనసాగిస్తోంది. దుబాయ్, థాయ్ల్యాండ్లో 8 మంది ఉన్నట్లు గుర్తించింది. పరారైన కిరణ్, సైఫ్ అహ్మద్, వరుణ్, శివకుమార్, సైమన్ ప్రసన్, ప్రద్యుమ్నల కోసం గాలిస్తోంది. ఇంటర్ పోల్ ద్వారా నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనుంది. నిందితులను భారత్కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఈమేరకు విదేశాంగ శాఖకు లేఖ రాసింది సిట్.