వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక పక్క పిఠాపురంలో మత్స్యకారులు ఎన్నికల వేళ తమకు పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. ఆ డిమాండ్ తో వారు పిఠాపురం జనసేన కార్యాలయాన్ని ముట్టడిస్తే… పవన్ కల్యాణ్ మాత్రం తనది పిఠాపురమే కాదు అన్నట్టు తన సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో బిజీగా ఉన్నారని శ్యామల ఆరోపించారు.