కమ్మ, రెడ్డి కులాలే పాలిస్తే ఎలా..?
NEWS Jul 24,2025 01:04 pm
భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేవలం కమ్మ, రెడ్డి కులాల వారే పాలిస్తే ఎలా అని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆ కులాలే పాలిస్తున్నాయంటూ ఆరోపించారు. ఈ రెండు కులాలు కావాలని బహుజనులను, వెనుకబడిన తరగతి వర్గాలను అణిచి వేశాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.