తుంగభద్ర ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత
NEWS Jul 24,2025 10:48 am
కర్నూలు జిల్లాలోని తుంగభద్ర డ్యామ్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1625.53 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 26,500 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 30,262క్యూ సెక్కులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 78.239 టీఎంసీలుగా ఉంది.