దళితులను విద్యకు దూరం చేసే చర్యలను ఉపసంహరించుకోవాలి
NEWS Jul 23,2025 11:02 pm
కెవిపిఎస్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్. శామ్యూల్ జార్జి ని కలిశారు. హనుమంతునిపాడు మండలంలో ఎనిమిది దళితవాడల్లో పాఠశాలలను కనీసం నిబంధనలు పాటించకుండా విలీనం చేశారని తెలిపారు. దళితులు విద్యకు దూరమయ్యే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు కోరారు.