ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి విషయంపై ఇంకా కేబినెట్ లో చర్చకు రాలేదన్నారు. త్వరలోనే దానిపై ఫోకస్ పెడతామని చెప్పారు. జనసన పార్టీని సంస్థాగత పరంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన త్వరలోనే ఉంటుందన్నారు.