స్థిరాస్తి రంగానికి ఏపీ సర్కార్ ఊతం
NEWS Jul 23,2025 08:36 am
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డెవలప్మెంట్ అగ్రిమెంట్లకు 3 శాతం స్టాంప్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు స్పష్టం చేసింది. సేల్ కం జీపీఏలకు 7.5 శాతం నుంచి 4 శాతానికి కుదించింది. రియల్ ఎస్టేట్కు ఊతమిచ్చేలా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆ రంగానికి చెందిన ఏజెంట్లు, వ్యాపారులు, నిర్మాణ రంగ కంపెనీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.