జగిత్యాల: ఛలో ఢిల్లీ వాల్పోస్టర్ ఆవిష్కరణ
NEWS Jul 22,2025 07:19 pm
జగిత్యాలలో ఛలో ఢిల్లీ వాల్పోస్టర్ను బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య దర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. మన దేశ జనాభాలో 72% పైగా ఉన్న బీసీలకు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23, 24 తేదీలలో ఛలో ఢిల్లీ పేరిట ఓబీసీ జాతీయస్థాయి సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.