ఢిల్లీ, హర్యానాలలో భూకంపం
NEWS Jul 22,2025 11:30 am
దేశ రాజధాని ఢిల్లీ, హర్యానాలోని ఫరీదాబాద్లో మంగళవారం భూమి కంపించింది. హర్యానాలో రిక్టర్ స్కేల్పై 3.2గా తీవ్రత నమోదైంది. భూ అంతర్భాగంలో 5 కి.మీ లోతులో ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అండమాన్ సముద్రంలో సైతం సోమవారం రాత్రి 11.30 గంటలకు 4.4 తీవ్రతతో కంపించింది భూమి.