మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ప్రసన్నపై కేసు నమోదు చేశారు. పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నారు నల్లపరెడ్డి.