ఏపీలో పేదలకు ఇంటి స్థలాలు
NEWS Jul 22,2025 09:25 am
ఏపీ సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. పేదలకు సంబంధించి ఇంటి స్థలాలు ఇచ్చేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇంటి స్థలాలను ముఖ్యంగా రాష్ట్రంలో అర్హులైన పేదలకు కేటాయిస్తారని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 3 సెంట్ల భూమి ,పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 2 సెంట్ల భూమి కేటాయిస్తామని తెలిపింది. లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి, ఆంధ్రప్రదేశ్కి చెందినవారై ఉండాలని స్పష్టం చేసింది.