నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పేంతవరకు తమ నిరసనలు ఆపేది లేదంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. 3 రోజుల నుంచి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసనలు చేస్తున్నారు.