పార్లమెంట్లో కొనసాగుతున్న వాయిదాల పర్వం
NEWS Jul 21,2025 07:17 pm
ఢిల్లీలో ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ఘాటుగా ప్రారంభం అయ్యాయి. ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. పలు అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశ పెట్టాయి. అధికార పక్షం ఒప్పుకోలేదు. దీంతో వాయిదాల పర్వం కొనసాగింది. లోక్ సభ మూడుసార్లు వాయిదా పడగా, రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. కాగా పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్పై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్సభ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లారు. దీంతో స్పీకర్లు వాయిదా వేయక తప్పలేదు.