Rajanna Sircilla :బోయినపల్లి మండలంలోని శ్రీరాజరాజేశ్వర (మిడ్ మానేరు) ప్రాజెక్టు నీరు లేక వెలవెలబోతోంది. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడిచినా ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. 2 నెలలుగా ముసురు తప్ప భారీ వర్షాలు కురవక ప్రాజెక్టుల్లో వరద చేరలేదు. ప్రాజెక్టులో ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు కేవలం 0.319 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. నీళ్లు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.