ఇసుక రవాణ లారీలపై కేసు నమోదు
NEWS Jul 21,2025 04:18 pm
ఇబ్రహీంపట్నంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 10లారీలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్ ఈరోజు తెలిపారు. రాజేశ్వర్రావుపేట, సత్తక్కపల్లి శివారులో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 లారీలను, బండలింగాపూర్ శివారులో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6 లారీలను పట్టుకున్నామన్నారు. ఆర్ఎ కాంతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేశామన్నారు.