టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ నుంచి నితీశ్ కుమార్ రెడ్డి ఔట్
NEWS Jul 21,2025 10:00 am
ఇంగ్లండ్తో నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మోకాలి గాయం కారణంగా ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్ నుంచి వైదొలిగినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆల్ రౌండర్ జట్టుతో కలిసి మాంచెస్టర్కు వెళ్లాడు కానీ ఆదివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదని సమాచారం.