మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం
NEWS Jul 03,2025 03:32 am
ప్రధాని నరేంద్ర మోదీకి ఘనా అత్యున్నత జాతీయ పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ లభించింది. ఆయన విశిష్ట రాజనీతిజ్ఞత, ప్రభావవంతమైన ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా రాష్ట్రపతి జాన్ డ్రమాని మహమా ఈ పురస్కారాన్ని అందజేశారు. 140 కోట్ల భారతీయుల తరపున ఈ గౌరవాన్ని అందుకున్న మోదీ, భారత్-ఘనా స్నేహబంధానికి, యువత ఆకాంక్షలకు దీనిని అంకితం చేశారు.