ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై నారా లోకేశ్ ప్రశంసలు
NEWS Jun 30,2025 01:30 pm
ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ఆ ఉపాధ్యాయుడికి అభినందనలు తెలిపారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం పడిన శ్రమను మరిచిపోవచ్చని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.