ఏపీఎస్ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. తిరుమలలో ఇక నుంచి ప్రైవేట్ వాహనాలు ఆశ్రయించకుండా ఉండేందుకు గాను ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం బస్సులను జెండా ఊపి ప్రారంభించారు ఏఈవో వెంకయ్య చౌదరి. ప్రైవేట్ వాహనాల దారి దోపిడీని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొండపై నుంచి తిరుపతి వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదన్నారు. ఎప్పటి లాగే రూ. 90 పెట్టి వెళ్ల వచ్చన్నారు.