ప్రభుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
NEWS Jun 29,2026 10:29 pm
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను వాయిస్ మెసేజ్ల రూపంలో కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించనుంది. సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులను అదేశించారు. ప్రస్తుతం కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో జరిగే గ్రీవెన్స్ వ్యవస్థను డిజిటల్ చేయాలని సూచించారు. ఈ కొత్త సదుపాయంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి, ప్రజల సమయం, ప్రయాణ ఖర్చు ఆదా కానుంది.