ఏపీలో కుబేర సినిమా టికెట్ ధరలు పెంపు
NEWS Jun 19,2025 04:03 pm
కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. కుబేర సినిమా ఈనెల 20న శుక్రవారం విడుదల కానుండడంతో టికెట్ ధరలు పెంచుతూ జీవో జారీ చేసింది. GO ప్రకారం సింగిల్ స్క్రీన్లలో టిక్కెట్ల ధరలు రూ. 236 వరకు పెంచగా, మల్టీప్లెక్స్ టిక్కెట్లు రూ. 265.50 వరకు పెంచింది. ధరల పెరుగుదల సినిమా ప్రేక్షకులు, వాణిజ్య వర్గాలలో చర్చకు దారితీసింది, కొందరు దీనిని థియేటర్ ఆదాయాలకు ప్రోత్సాహకంగా స్వాగతించగా మరికొందరు ప్రేక్షకులపై అదనపు భారంగా పేర్కొన్నారు.