ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్లు వేలం - టీటీడీ
NEWS Jun 19,2025 02:09 pm
టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న 74 లాట్ల మొబైల్ ఫోన్లను జూన్ 20 నుండి 21వ తేదీ వరకు టిటిడిలో ఆన్ లైన్ ద్వారా ఈ - వేలం వేస్తున్నట్లు తెలిపింది. కార్భన్ , ఎల్ వై ఎఫ్, నోకియా, శాంసంగ్, లావా, ఐటెల్, లెనోవా, ఫిలిప్స్, ఎల్.జి.సాంసుయ్, ఒప్పో, పోకో, ఏసర్, పానాసోనిక్, హానర్, వన్ ప్లస్, బ్లాక్ బెర్రి, ఎంఐ, జియోనీ, మైక్రోసాఫ్ట్ , ఆనస్, కూల్ పాడ్, హెచ్ టి సి, మోటోరోలా, టెక్నో, ఇంఫినిక్స్, రియల్ మీ, హువాయ్, సెల్కన్, వివో, మైక్రో మాక్స్, మొబైల్ ఫోన్లు ఉన్నాయని తెలిపింది.