జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిల
NEWS Jun 19,2025 01:46 pm
తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బెట్టింగ్ లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ల కుటుంబాలను పరామర్శిస్తారా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. బెట్టింగ్ లకు పాల్పడి, ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు విగ్రహాలు కట్టడమేంటని ప్రశ్నించారు. జగన్ నిన్నటి పర్యటన కారణంగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారని... వీరి మరణాలకు కారణమెవరని ప్రశ్నించారు.