అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్
NEWS Jun 19,2025 01:30 pm
ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలను, మా పార్టీ నాయకులను కలవాలనుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కొనసాగుతున్న అణచివేతపై ప్రజలకు నిజం తెలియాల్సి ఉందనే ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో తాను పర్యటిస్తే పోలీసు బలగాలను మోహరించి ఎక్కడికక్కడ ప్రజలను అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు.