శ్రీవారి ప్రాణదాన టస్టుకు రూ.10 లక్షలు విరాళం
NEWS Jun 19,2025 01:15 pm
తిరుమలలోని శ్రీవారికి విరాళాలు పెద్ద ఎత్తున అందుతున్నాయి భక్తుల నుంచి. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస అనిదృత్ అనే భక్తుడు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ. 10, 00, 116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తరపున వై.రాఘవేంద్ర తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు.