కార్యకర్తలు, ప్రజలను కలిస్తే తప్పేంటి..?
NEWS Jun 19,2025 12:05 pm
ఏపీ కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ సీఎం వైఎస్ జగన్. తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, ప్రజలను పరామర్శించడం తప్పా అని ప్రశ్నించారు. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టారో చెప్పాలన్నారు. కార్యకర్తలను ఎందుకు ఎక్కడికక్కడ కట్టడి చేశారని నిలదీశారు. తన పర్యటన సందర్బంగా లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయలేక పోయారంటూ ఫైర్ అయ్యారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను పర్యటిస్తూనే ఉంటానని ప్రకటించారు.