ఘనంగా శ్రీ సుందర రాజ స్వామి కళ్యాణం
NEWS Jun 19,2025 11:47 am
తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజ స్వామివారి అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 10 -11గం.ల మధ్య స్వామి వారికి కళ్యాణోత్సవం చేపట్టారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గం.ల మధ్య స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ చేపట్టారు. రాత్రి హనుమంత వాహనంపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు.