ఓడ రేవులు, ఎయిర్ పోర్టులపై ఫోకస్
NEWS Jun 19,2025 08:29 am
మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రోడ్లు, రైళ్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ అనుసంధానం చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కలిపి మొత్తంగా 20 కి తగ్గకుండా.. అదే సమయంలో ఖచ్చితంగా 14 ఎయిర్ పోర్టులు ఉండే విధంగా భవిష్యత్తు కార్యాచరణతో ముందుకు సాగుతామన్నారు. ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.