పలు విమాన సర్వీసులు రద్దు
NEWS Jun 19,2025 07:45 am
ఎయిరిండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుతం నడుస్తున్న ఫ్లైట్స్ లలో 15 శాతం విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల వరుస సంఘటనలు చోటు చేసుకోవడం, ప్రమాదాలకు గురి కావడం, సాంకేతిక లోపాలతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడడంతో అంతర్జాతీయ సేవలను తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిపింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూరప్, తూర్పు ఆసియాలోని అనేక దేశాల గగనతలంలో రాత్రి కర్ఫ్యూ, కొనసాగుతున్న మెరుగైన భద్రతా తనిఖీలు, ఇంజనీరింగ్ సిబ్బంది దృష్ట్యా తగ్గిస్తున్నట్లు పేర్కొంది.