విమాన ప్రమాదం.. డీఎన్ఏ పరీక్ష ద్వారా 184 మృతదేహాలు గుర్తింపు
NEWS Jun 18,2025 04:57 pm
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో (Air India plane crash) మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 8 గంటల వరకూ డీఎన్ఏ పరీక్షల (DNA samples) ద్వారా 184 మంది వివరాలు గుర్తించినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి బుధవారం ఉదయం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు. ‘ఉదయం 8 గంటల సమయం వరకూ 184 డీఎన్ఏలు సరిపోలాయి’ అని పేర్కొన్నారు. గుర్తించిన మృతదేహాలను అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు.