విశాఖపట్నం బీచ్లో జూన్ 20, 21న డ్రోన్లు నిషేధం
NEWS Jun 18,2025 04:23 pm
జూన్ 21న విశాఖఫట్నంలోని బీచ్ రోడ్డు ప్రధాన వేదికగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలు నిర్వహిస్తున్నందున నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని, కావున నగర ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్బీ అన్నారు. జూన్ 21న జరగనున్న ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలో 5 లక్షల మంది పాల్గొంటారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.