ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం శుభవార్త
NEWS Jun 18,2025 04:01 pm
కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వాహనదారులకు మేలు చేకూర్చేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఏడాదికి ఒకసారి రిచార్జ్ చేసుకుని 200 ట్రిప్పులు వరకు తిరిగే పాస్ ను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఏడాదికి రూ. 3 వేలు రీచార్జ్ చేసుకుని దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు స్పష్టం చేశారు.