సాంకేతికతతో సమాచార విశ్లేషణ - సీఎం
NEWS Jun 18,2025 03:57 pm
కచ్చితమైన ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం లెక్కల్లో జాతీయ స్థాయికి మించి ఏపీ పురోగతిని సాధించిందని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 8.7 శాతం మేర పెరిగితే.. ఏపీ 11.89 శాతం మేర పురోగతి నమోదు చేసిందని అధికారులు వెల్లడించారు.