జగన్ పర్యటనపై ఆంక్షలెందుకు? కూటమి ప్రభుత్వం భయపడుతోందంటున్న వైసీపీ
NEWS Jun 18,2025 02:27 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన, పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్న వైసీపీ నేత, ఉప సర్పంచ్ నాగమల్లేశ్వర రావు కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తారు. తాను ఉన్నానని ధైర్యం చెబుతున్నారు. ఇదివరకు ఆయన ఓదార్పు యాత్రల్లో కూడా ఇలాగే బాధితులను కలిసి ఓదార్చేవారు. ఐతే.. ఈ పర్యటనకి ప్రభుత్వం ఆంక్షలు విధించడం హాట్ టాపిక్ అయ్యింది.