బనకచర్ల ప్రాజెక్టుతో వచ్చిన సమస్యేంటి? తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల వాదనేంటి?
NEWS Jun 18,2025 01:57 pm
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు వివాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ ప్రాజెక్టు గోదావరి నది నుంచి 200 టీఎంసీ నీటిని కృష్ణా బేసిన్ ద్వారా పెన్నా బేసిన్కు తరలించే లక్ష్యంతో ఉంది. రూ.80,000 కోట్ల ఖర్చుతో ఏపీ ప్రభుత్వం దీన్ని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గట్టిగా సమర్థిస్తున్నారు. ఇది కేవలం వరద నీటిని మాత్రమే ఉపయోగిస్తుందని అంటున్నారు. తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ జరగదని వాదిస్తున్నారు.