వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో అపశృతి..
NEWS Jun 18,2025 01:09 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. జగన్ పర్యటన సందర్భంగా గుంటూరులో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఏటుకూరు సమీపంలోని లాల్పురం హైవేపై జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ లోని వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మరణించాడు.