విద్యార్థికి DNR ట్రస్ట్ ఆర్థిక సహాయం
NEWS Jun 18,2025 06:03 am
తాడ్వాయి: నార్లాపూర్ గ్రామానికి చెందిన అను ముల శ్రీకాంత్కు IIT మద్రాస్లో ఎంటెక్ అడ్మిషన్ కోసం DNR ట్రస్ట్ ఆర్థిక సహాయం అందించింది. గతంలో అడ్మిషన్ ఫీజు కోసం ₹58,000 అందజే సిన ట్రస్ట్, తాజాగా సెమిస్టర్ ఫీజు కోసం ₹32,000 అందించి, మొత్తం ₹90,000తో శ్రీకాంత్ ఉన్నత చదువులకు తోడ్పడింది. ఈ సహాయంతో ఓ పేద విద్యార్థి తన విద్యా లక్ష్యాల వైపు సాగుతున్నాడు. DNR ట్రస్ట్ నిర్వహకులు ప్రతాపరెడ్డి, సభ్యుల సహకారానికి శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపాడు.