21 వరకు ఆర్కే బీచ్ రోడ్డు మూసివేత
NEWS Jun 17,2025 12:01 pm
ఈనెల 21న విశాఖలో జరిగే యోగా డేకు హాజరవుతున్నారు పీఎం మోదీ. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి విశాఖ బీచ్ రోడ్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ప్రధాని టూర్ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలిపారు ఎస్పీ. నావల్ కోస్ట్ నుంచి పార్క్ హోటల్ వరకు రెడ్ జోన్ ఉంటుందన్నారు. పీఎం విశాఖకు వచ్చి ఢిల్లీకి వెళ్లేంత వరకు ఆర్కే బీచ్ రోడ్డు మూసి వేస్తున్నామన్నారు. 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ల ఎగవేతపై నిషేధం ఉంటుందన్నారు.