భారత విదేశాంగ కీలక ఆదేశాలు జారీ చేసింది. టెహ్రాన్ లోని భారతీయ విద్యార్థులు వెంటనే నగరాన్ని విడిచి వెళ్లాలని సూచించింది. ఇరాన్ లోని భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. కొంతమంది భారతీయులను అర్మేనియా సరిహద్దు ద్వారా ఇరాన్ ను విడిచిపెట్టేందుకు వీలు కల్పించినట్లు వెల్లడించింది. అక్కడ ఉంటున్న వారితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.