మాజీ సీఎం జగన్ రెడ్డి టూర్ కు లా అండ్ ఆర్డర్ దృష్ట్యా సత్తెన్నపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదన్నారు పల్నాడు ఎస్పీ. టూర్ కు సంబంధించి వివరాలు ఇప్పటి వరకు తమకు తెలియ చేయలేదని పేర్కొన్నారు. గతంలో పర్యటన దృష్ట్యా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అందుకే ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఒకవేళ తాము కోరిన వివరాలు ఇస్తే పర్మిషన్ ఇవ్వాలా వద్దా అన్నది ఆలోచిస్తామన్నారు ఎస్పీ.