పనితీరు మార్చుకోక పోతే పక్కన పెడతా
NEWS Jun 17,2025 09:16 am
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను. చురకలు అంటించారు. ఎమ్మెల్యేల పనితీరుపై తాను సర్వే చేయించానని చెప్పారు. చాలా మంది ఇంకా పనితీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. లేక పోతే చర్యలు తప్పవంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. ప్రజల్లో రిపోర్టు బాగుంటే జిందాబాద్ అంటా లేదంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తానని అన్నారు. కార్యకర్తలే మనకు బలం..ప్రజలే బలగం..వారితోనే ఉండాలని స్పష్టం చేశారు.