శ్రీవారిని దర్శించుకున్న పీయూష్ గోయల్
NEWS Jun 17,2025 08:33 am
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ ప్రధాన పూజారులు. అనంతరం టీటీడీ ఛైర్మన్, అడిషనల్ ఈవో మంత్రికి శ్రీవేంకటేశ్వర స్వామి వారి పట్టువస్త్రం, ప్రసాదాలు, లామినేషన్ ఫోటోను అందజేశారు.