గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామంలో రేపు రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నట్లు తహశీల్దార్ అనుపమ రావు తెలిపారు. భూ భారతి నూతన రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు. ప్రజలు సదస్సును సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఉప్పరమల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతుందన్నారు.