లంచం తీసుకుంటూ దొరికిన DEO
NEWS Jun 16,2025 02:08 pm
ములుగు జిల్లా డీఈవో, జూ.అసిస్టెంట్ను పట్టుకుంది ACB. సిక్ లీవ్ నుంచి రిపోర్ట్ చేసిన టీచర్కు పోస్టింగ్ ఇచ్చేందుకు 20వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధిత టీచర్ ACBని ఆశ్రయించాడు. టీచర్ నుంచి DEO ఫణిని రూ. 15000, జూనియర్ అసిస్టెంట్ దిలీప్ రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ACB పట్టుకుంది. వీరిద్దరిని అరెస్ట్ చేశారు ACB అధికారులు.