చంద్రబాబూ ఇక పాలన చాలు - ఓవైసీ
NEWS Jun 16,2025 01:19 pm
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. ఆయనకు ఉచిత సలహా ఇచ్చారు. లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని, 14 ఏళ్లు పాలించావు ఇక చాలు అని హితవు పలికారు. లోకేష్ భవిష్యత్తును నాశనం చేయవద్దన్నారు. ఎలాగూ మీరు జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు ఇవ్వరంటూ ఎద్దేవా చేశారు. తాజాగా ఓవైసీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.