లా అండ్ ఆర్డర్ కు ఢోకా లేదు
NEWS Jun 16,2025 10:00 am
రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఢోకా లేదన్నారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. వైసీపీ కావాలని అసంబద్ద ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. కావాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ మండిపడ్డారు. తల్లికి వందనంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, నిరూపించాలని సవాల్ విసిరితే ఇప్పటి వరకు పత్తా లేకుండా పోయారంటూ ఎద్దేవా చేశారు. ఇలా చేయడం వల్లనే ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పారని, కేవలం 11 సీట్లకే పరిమితం చేశారంటూ మండిపడ్డారు.