ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం బాధాకరం
NEWS Jun 16,2025 09:56 am
ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కూలిన ఘటనపై స్పందించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత 6 వారాల్లో ఇది 5వ హెలికాప్టర్ ప్రమాదం జరగడం పట్ల ఆవేదన చెందారు. ఈ ప్రమాదాలకు జవాబుదారీతనం ఎవరనేది నిర్దారించాలన్నారు. జరిగిన ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.