మరోసారి ఏసీబీ ముందుకు కేటీఆర్
NEWS Jun 16,2025 09:12 am
మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఏసీబీ ముందుకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని రేవంత్ రెడ్డి సర్కార్ విచారణకు ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్ 19న కేసు నమోదు చేసింది ఏసీబీ.హెచ్ఎండీఏ నుంచి ఎఫ్ఈఓకు రూ.50 కోట్లకు పైగా నిధులు మళ్లించడంపై దృష్టి సారించింది. ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని విచారించింది.