రేపటి నుంచి పెట్టుబడి సాయం
NEWS Jun 15,2025 06:31 pm
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పెట్టుబడి సాయం కింద రేపటి నుంచి రైతులకు రూ. 12 వేలు తమ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులకు ఇబ్బంది లేకుండా సరఫరా చేసేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు.